తొర్రూరు :
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్టు కలకలం రేపింది.ఎంపీ కడియం కావ్య అక్రమంగా ఓటు ఎలా వేస్తారని ప్రశ్నిస్తూ నిరసన వ్యక్తం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు నిర్ధాక్షిణ్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీయడంతో వెంటనే పోలీసులు ఆయనను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా రాజకీయ ఉద్రిక్తతలకు కారణమైంది.

