మహబూబ్ నగర్ :
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ జిల్లాకు కొత్త దంపతులు విజయ్ దేవరకొండ , రశ్మిక రానున్నారు. విజయ్ దేవరకొండ సొంత గ్రామం బల్మూరు మండలం తుమ్మెన్ పేట గ్రామంలో సోమవారం విజయ్ దేవరకొండ , రష్మిక నూతన దంపతుల వ్రతం ఏర్పాటు చేశారు. దీంతో సొంత ఊరిలో ఫామ్ హౌజ్ ను అంగరంగవైభవంగా ముస్తాబు చేస్తున్నారు. ఇంటి ముందర పందిళ్లు.. అలంకరణలు.. వ్రతం తరవాత సామూహిక భోజనాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇప్పటికే విజయ్ రష్మిక దంపతులు దేశ వ్యాప్తంగా పలు ప్రముఖ ఆలయాల్లో అన్నదానం ఈ రోజు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలకు మిఠాయిలు పంపిస్తున్నట్లు ఉదయాన్నే తెలిపారు.

