హుస్నాబాద్ :
ప్రజాస్వామిక భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు.. ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు.. కానీ తెలంగాణ పట్ల చులకనగా మాట్లాడి తెలంగాణ ఏర్పాటు వేర్పాటువాదం మాట్లాడి ,కోనసీమ లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్న తెలంగాణ దిష్టి అన్నటువంటి పవన్ కళ్యాణ్ తో బీజేపీ పొత్తుపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ పై విమర్శలు చేసిన జనసేన తో పొత్తుపెట్టుకుంటే తెలంగాణ ఉద్యమకారులు , మేధావులు, ప్రజాస్వామిక వాదులు గమనించాలన్నారు. కొండగట్టు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఇంకా ఏం చేసినా.. మిమ్మల్ని ఎప్పటికైనా తెలంగాణ వ్యతిరేకిగానే చూస్తాం .. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ,ఉద్యమకారులను ఆలోచించాలన్నారు.

